మన పత్రిక, వెబ్డెస్క్
Pension vidroha dinam on September 1st – తెలంగాణ రాష్ట్ర ( Telangana State ) ఉద్యోగ జేఏసీ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ TGEJAC పిలుపునిచ్చింది. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి, పాత పెన్షన్ పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి స్పష్టమైన సందేశం ఇవ్వనున్నారు.
సెప్టెంబర్ 8 నుండి జిల్లాల మేరకు జేఏసీ బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ యాత్రల్లో భాగంగా జిల్లా స్థాయిలో ఉద్యోగ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి, ఉద్యమ కార్యాచరణను బలోపేతం చేస్తారు. అక్టోబర్ 12న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 33 జిల్లాల నుండి లక్షలాది ఉద్యోగులు ఈ కార్యక్రమానికి తరలిరానున్నారు. ఇది పెన్షన్ సమస్యపై ప్రభుత్వానికి బలమైన సందేశం ఇవ్వడానికి ముఖ్యమైన అడుగు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
