Advertisement

పటాన్‌చెరులో జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలు.. జనవరి 4న మైత్రి మైదానంలో ఈవెంట్

మన పత్రిక, వెబ్​డెస్క్: పటాన్‌చెరు పట్టణం జాతీయ స్థాయి క్రీడా సంబరానికి వేదిక కానుంది. జనవరి 4న స్థానిక మైత్రి మైదానంలో ‘జీఎంఆర్ ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్’ పోటీలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పోటీల బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

యువత శారీరక దారుఢ్యం, మానసిక క్రమశిక్షణతో ఎదగాలనే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పృథ్వీరాజ్ తెలిపారు. పటాన్‌చెరు గడ్డపై తొలిసారిగా జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి బాడీ బిల్డర్లు పాల్గొననున్నారు. యువత వ్యాయామం, క్రీడలను జీవనశైలిలో భాగంగా చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement