రూపాయి నాణెం తయారీలో ప్రభుత్వానికి భారీ నష్టం. RBI నివేదిక ప్రకారం, ఒక రూపాయి నాణెం తయారు చేయడానికి దాని ముఖ విలువ కంటే 11 పైసలు ఎక్కువ ఖర్చు అవుతోంది. 2018లో ఈ ఖర్చు రూ.1.11గా ఉంది. అయితే, రెండు, ఐదు, పది రూపాయల నాణేల తయారీలో ప్రభుత్వానికి లాభం వస్తుంది. కాగితపు కరెన్సీ ముద్రణ నాణేల తయారీ కంటే చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది.
డిజిటల్ చెల్లింపుల పెరుగుదలతో చిల్లర నాణేల డిమాండ్ తగ్గుతోంది. నాణేల ఉత్పత్తి ఖర్చు తగ్గించడానికి ప్రత్యామ్నాయ పదార్థాల వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
Advertisement
