మన పత్రిక, వెబ్డెస్క్: నిజామాబాద్ జిల్లా ( Nizamabad District ) ఆలూర్ మండల ( Alur Mandal ) కేంద్రానికి చెందిన కుర్మే బీజ చిన్న రాజేష్ (45) గల్ఫ్ దేశం ఇరాక్లో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా, జీవనోపాధి కోసం ఒకటిన్నర సంవత్సరం క్రితం రాజేష్ విదేశాలకు వెళ్లాడు.
అక్కడ ఓ నిర్మాణ పనులు చేస్తుండగా, నిన్న (శుక్రవారం) ప్రమాదవశాత్తు బ్రిడ్జి పై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు శనివారం సమాచారం అందింది. మృతుడు రాజేష్కు తల్లి, భార్య సునీత, ముగ్గురు కూతుర్లు ఉన్నారు.
Advertisement
రాజేష్ ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
