Advertisement

NHAI Offer: ఫొటో పంపిస్తే రూ.1000 ఫ్రీ

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వాహనదారులకు ఒక అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. టోల్ ప్లాజాల్లోని NHAI నిర్వహణలో ఉన్న అపరిశుభ్రమైన టాయిలెట్లపై ఫిర్యాదు చేస్తే, ఫాస్టాగ్ అకౌంట్‌లో రూ.1,000 రివార్డ్ జమ అవుతుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు మాత్రమే.

ఫిర్యాదు చేయాలంటే ‘రాజమార్గ్ యాత్ర’ యాప్‌లో టైమ్ స్టాంప్‌తో పాటు టాయిలెట్ ఫోటోలు అప్‌లోడ్ చేయాలి. అర్హత కలిగిన వారికి మాత్రమే రివార్డు లభిస్తుంది. ఇది కేవలం NHAI నిర్వహించే టాయిలెట్లకు మాత్రమే వర్తిస్తుంది.

Advertisement

టోల్ ప్లాజాల్లో శుభ్రత గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. డబ్బు కూడా వస్తుంది!

Advertisement