Advertisement

నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్..

మన పత్రిక, వెబ్​డెస్క్: నవంబర్ 1 (ఈరోజు) నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఇకపై ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, DOB, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునేందుకు రూ. 75 ఛార్జీ చెల్లించాలి. బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం ఆధార్ కేంద్రానికి వెళ్తే రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాంకింగ్ రంగంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఖాతాదారులు తమ బ్యాంక్ అకౌంట్లు, లాకర్లు, సేఫ్ కస్టడీల కోసం ఇకపై గరిష్టంగా నలుగురు నామినీలను నియమించుకోవచ్చు.

Advertisement

అలాగే, ఎస్‌బీఐ (SBI) క్రెడిట్ కార్డు యూజర్లు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా ఎడ్యుకేషన్ ఫీజు చెల్లించినా, లేదా రూ. 1000 పైన వాలెట్ రీఛార్జ్ చేసినా 1% ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement