మన పత్రిక, వెబ్డెస్క్: నారాయణపేట జిల్లా కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్ పాఠశాల విద్యార్థిని మోక్షిత మరాఠీ భగవద్గీత కంఠస్థంలో అద్భుత ప్రతిభ కనబరిచింది. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ఆమె విజేతగా నిలిచి, రాష్ట్ర స్థాయికి ఎంపికైంది.
అశోక్ నగర్ శాఖకు చెందిన మోక్షిత, ప్రాథమిక స్థాయి (ఒకటవ తరగతి వరకు) విభాగంలో ఈ ఘనత సాధించింది. చిన్ననాటి నుంచే తమ బిడ్డకు హనుమాన్ చాలీసా, భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్నామని తల్లిదండ్రులు వెంకట రాములు, స్వప్న రాణి తెలిపారు.
Advertisement
పిల్లలకు చిన్నప్పటి నుంచే సంస్కృతి, సంప్రదాయాలు నేర్పించడం వల్ల వారు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని వారు పేర్కొన్నారు. మోక్షిత తల్లిదండ్రుల స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని నిర్వాహకులు కోరారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
