Advertisement

నంద్యాలలో ఏసీబీ షాక్: లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు

మన పత్రిక, వెబ్​డెస్క్: నంద్యాల జిల్లా ( Nandyal District ) ఆళ్లగడ్డలో ( Allagadda ) రోడ్లు భవనాల శాఖ ( Roads and Buildings Department ) అసిస్టెంట్ ఇంజనీర్ దూదేకుల దస్తగిరి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతిలో చిక్కాడు. కాంట్రాక్టర్ నుంచి ఆప్టిక్ ఫైబర్ వర్క్ కోసం 55 వేల రూపాయలు డిమాండ్ చేశాడు.

బాధితుడు రమేష్ మొదట రూ.40 వేలు ఇచ్చాడు. మిగిలిన 15 వేల కోసం దస్తగిరి ( Assistant Engineer Dastagiri ) పట్టుబడ్డాడు. లంచం ఇవ్వడానికి ఇష్టం లేక కాంట్రాక్టర్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. అప్పుడే ఏసీబీ వల పన్ని, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు.

Advertisement

డీఎస్పీ సోమన్న వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కేసు విచారణ కొనసాగుతోంది. అవినీతి నిరోధక శాఖ చర్యలు ఇంకా కొనసాగుతాయి.

Advertisement