మన పత్రిక వెబ్డెస్క్, నల్గొండ: రబీ సీజన్ లో రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మిర్యాలగూడ సమీపంలోని తుంగపహాడ్ మార్క్ఫెడ్ గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నిల్వలు, రవాణా లారీల ఏర్పాట్లపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం శ్రీనివాస్ నగర్ లోని ఎరువుల దుకాణాన్ని సందర్శించి ఆన్లైన్ విక్రయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్ కు తమ సమస్యలను వివరించారు. ఆన్లైన్ లో స్టాక్ చూపించిన పది నిమిషాల్లోనే అయిపోతోందని, ఏ మండలంలోని రైతులకు అక్కడే ఎరువులు అందేలా చూడాలని కోరారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ‘ఎరువుల యాప్’ పనితీరుపై కూడా కలెక్టర్ ఆరా తీశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
