మన పత్రిక వెబ్డెస్క్, నల్గొండ: రబీ సీజన్ లో రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మిర్యాలగూడ సమీపంలోని తుంగపహాడ్ మార్క్ఫెడ్ గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నిల్వలు, రవాణా లారీల ఏర్పాట్లపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం శ్రీనివాస్ నగర్ లోని ఎరువుల దుకాణాన్ని సందర్శించి ఆన్లైన్ విక్రయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్ కు తమ సమస్యలను వివరించారు. ఆన్లైన్ లో స్టాక్ చూపించిన పది నిమిషాల్లోనే అయిపోతోందని, ఏ మండలంలోని రైతులకు అక్కడే ఎరువులు అందేలా చూడాలని కోరారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ‘ఎరువుల యాప్’ పనితీరుపై కూడా కలెక్టర్ ఆరా తీశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
