Advertisement
nalgonda collector ila tripathi orders rice millers

District collector: రైస్ మిల్లర్లకు నల్గొండ కలెక్టర్ ఆదేశం..

మన పత్రిక, వెబ్​డెస్క్: ఈ వానాకాలం సీజన్‌లో ధాన్యం సేకరణలో భాగంగా, ఇంకా బ్యాంకు గ్యారంటీలు ఇవ్వని మిల్లర్లు వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు ఎప్పటికప్పుడు తమ మిల్లులలో దించుకోవాలని, ఈ విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని ఆమె గట్టిగా సూచించారు.

Advertisement

ప్రస్తుతం అకాల వర్షాలు కురుస్తున్నాయని, దీనివల్ల కొనుగోలు కేంద్రాల్లో లేదా పంటపై ఉన్న ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యత ప్రమాణాలతో మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని అన్‌లోడ్ చేయడంలో ఏమాత్రం జాప్యం చేయరాదని, రైతులకు తక్షణమే సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Advertisement

సమావేశం అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి అవంతిపురంలోని సూర్య తేజ రైస్ ఇండస్ట్రీస్‌ను సందర్శించారు. అక్కడ ధాన్యం ప్రాసెసింగ్ జరుగుతున్న విధానాన్ని ఆమె పరిశీలించారు. బాయిల్డ్ రైస్, డ్రైయర్స్ పనితీరు వంటి అంశాలను మిల్లు యజమానిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేష్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ వెంకటరమణ చౌదరి, కోశాధికారి గందె రాము, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement