మన పత్రిక, వెబ్డెస్క్
చైనాలో జరిగిన SCO శిఖరాగ్ర ( sco summit ) సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలిసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘పుతిన్ను కలవడం ఎప్పుడూ ఆనందమే’ అని పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ Xలో ఫొటోలు షేర్ చేశారు. ఆయనతో హత్తుకుని, నవ్వుతూ సంభాషించిన సన్నివేశాలు ఈ ఫొటోల్లో కనిపిస్తున్నాయి. ఇది ఇద్దరు నాయకుల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్తో కూడా మోదీ సంభాషించారు. ప్రాంతీయ సహకారం, భద్రతా సవాళ్లు, ఆర్థిక భాగస్వామ్యాలపై చర్చించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. SCO సదస్సులో భారత్, రష్యా, చైనా సహా పలు సభ్య దేశాల నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం సామూహిక ప్రయత్నాలపై దృష్టి పెట్టారు. మోదీ పుతిన్ల సమావేశం అంతర్జాతీయ స్థాయిలో దృష్టి ఆకర్షించింది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని సంకేతాలిచ్చింది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
