మన పత్రిక వెబ్డెస్క్, మదనపల్లె: వైద్య రంగంలో సాంకేతికత వినియోగంపై చేసిన పరిశోధనకు గాను మదనపల్లె మిట్స్ (MITS) డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె. పుగళరసికి డాక్టరేట్ వరించింది. చెన్నైలోని అన్నా యూనివర్సిటీ నుంచి ఆమెకు ఈ పట్టా లభించినట్లు మిట్స్ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ వెల్లడించారు.
‘కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్, ఎవల్యూషనరీ ఆల్గోరిథం’ వంటి అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించి బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడం, వర్గీకరించడం అనే అంశంపై ఆమె ఈ పరిశోధన పూర్తి చేశారు. ఈ సందర్భంగా మిట్స్ ఛాన్సలర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి, విభాగాధిపతులు పుగళరసిని ప్రత్యేకంగా అభినందించారు.
Advertisement
ఆమె పరిశోధన భవిష్యత్తులో వైద్య రంగానికి ఎంతో ఉపయోగపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
