WhatsApp
Advertisement

బ్రెయిన్ ట్యూమర్ పై పరిశోధన.. మిట్స్ అధ్యాపకురాలికి డాక్టరేట్

మన పత్రిక వెబ్​డెస్క్, మదనపల్లె: వైద్య రంగంలో సాంకేతికత వినియోగంపై చేసిన పరిశోధనకు గాను మదనపల్లె మిట్స్ (MITS) డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె. పుగళరసికి డాక్టరేట్ వరించింది. చెన్నైలోని అన్నా యూనివర్సిటీ నుంచి ఆమెకు ఈ పట్టా లభించినట్లు మిట్స్ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ వెల్లడించారు.

‘కన్వల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్, ఎవల్యూషనరీ ఆల్గోరిథం’ వంటి అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించి బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడం, వర్గీకరించడం అనే అంశంపై ఆమె ఈ పరిశోధన పూర్తి చేశారు. ఈ సందర్భంగా మిట్స్ ఛాన్సలర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి, విభాగాధిపతులు పుగళరసిని ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

ఆమె పరిశోధన భవిష్యత్తులో వైద్య రంగానికి ఎంతో ఉపయోగపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement