Advertisement

ఓటమి భయంతో సెల్ టవర్ ఎక్కిన సర్పంచ్ అభ్యర్థి!

మన పత్రిక, వెబ్​డెస్క్: మెదక్ జిల్లాలో (Medak District) పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. నర్సంపల్లి పెద్ద తండాలో శంకర్ నాయక్ అనే సర్పంచ్ అభ్యర్థి అనూహ్యంగా సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. తన ప్రత్యర్థి గెలుపు కోసం ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని, ఒక్కో ఓటుకు రూ. 2,000 ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.

గతంలోనూ తాను ఇలాంటి కుట్రల వల్లే ఓడిపోయానని, ఇప్పుడు కూడా ధనబలం ముందు నిజాయితీ ఓడిపోతుందనే ఆవేదనతో ఈ పని చేసినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని శంకర్ నాయక్‌కు నచ్చజెప్పి కిందికి దించే ప్రయత్నం చేశారు. అక్రమాలపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement