WhatsApp
Advertisement

మహీంద్రా ఎక్స్‌యువి 700 ధరలో భారీ తగ్గింపు: జీఎస్టీ మార్పుతో ₹1.43 లక్షల వరకు పొదుపు

భారత ప్రభుత్వం గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) రేట్లను తగ్గించడం, కంపెన్సేషన్ సెస్ రద్దు చేయడంతో ఆటోమొబైల్ రంగానికి పెద్ద ఊరట లభించింది. దీంతో చాలా కార్ల ధరలు తగ్గాయి. మహీంద్రా ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందిస్తూ, సెప్టెంబర్ 6, 2025 నుంచి కొత్త ధరలను ప్రకటించింది. ప్రముఖ ప్రీమియం ఎస్యూవీ మహీంద్రా ఎక్స్‌యువి 700 ధరలో భారీ తగ్గింపు వచ్చింది. ప్రతి వేరియంట్ పై గణనీయమైన పొదుపు సాధ్యమయ్యింది. కంపెనీ ఖచ్చితమైన కొత్త ధరలు ఇంకా విడుదల చేయకపోయినా, వేరియంట్ వారీగా ఎంత తగ్గింపు ఉంటుందో ప్రకటించింది.

Mahindra xuv700 gets new tentative prices according to new gst rates

వేరియంట్పొదుపు
MX₹88,900
AX3₹1,06,500
AX5 S₹1,10,200
AX5₹1,18,300
AX7₹1,31,900
AX7 L₹1,43,000

టాప్ ఎండ్ AX7 L వేరియంట్ పై ₹1.43 లక్షల వరకు పొదుపు ఉంది. బేస్ మాడల్ కాకుండా మిగిలిన అన్ని వేరియంట్లపై ధర ₹1 లక్ష పైగా తగ్గింది.

Advertisement

ఎక్స్‌యువి 700 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవు కలిగి, 1,500cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ఎస్యూవీ. ఇంతకు ముందు దీనిపై 28% జీఎస్టీ + 20% సెస్ కలిపి 48% పన్ను ఉండేది. ఇప్పుడు ఫ్లాట్ 40% జీఎస్టీ వర్తిస్తుంది. దీంతో 8% పన్ను తగ్గింపు వచ్చింది. ఈ మార్పు వల్ల పెట్రోల్, డీజిల్ రెండు వెర్షన్లపైనా సమాన ప్రయోజనం ఉంది. ఖచ్చితమైన ధరల కోసం స్థానిక మహీంద్రా డీలర్ షిప్ ను సంప్రదించాలి.

కొత్త జీఎస్టీ రేట్లు – కార్లు ఇప్పుడు చౌకగా:

  • 4 మీటర్ల కంటే తక్కువ కార్లు: పెట్రోల్ 1.2L లోపు, డీజిల్ 1.5L లోపు → జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గింపు. 5–13% వరకు చౌక.
  • 4 మీటర్ల కంటే ఎక్కువ కార్లు: పెద్ద ఇంజిన్లు → జీఎస్టీ 40% (సెస్ లేకుండా). ఇంతకు ముందు 48% కావడంతో 3–10% వరకు ధర తగ్గింది.

ఈ మార్పులు చిన్న కార్ల నుంచి ప్రీమియం ఎస్యూవీల వరకు అన్ని వర్గాల కొనుగోలుదారులకు లాభాలు అందిస్తున్నాయి.

Advertisement