Advertisement

గ్రామగ్రామాన మహిళా భవనాలు.. ఒక్కో దానికి రూ.10 లక్షలు మంజూరు!

మన పత్రిక, వెబ్​డెస్క్: మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHGs) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై వారు చెట్ల కింద, ఆలయాల వద్ద సమావేశాలు నిర్వహించే అవస్థలకు చెక్ పడనుంది. ఉపాధిహామీ నిధులతో ప్రతి గ్రామంలో ‘మహిళా సమాఖ్య భవనాల’ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది.

యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 561 గ్రామ సమాఖ్యలు ఉండగా, ఇప్పటివరకు 256 గ్రామాల్లో స్థలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన చోట్ల ఒకటి రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తి కానుంది. సుమారు 200 గజాల స్థలంలో, 552 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాలను నిర్మించనున్నారు. గ్రామ సభ తీర్మానం, అధికారుల పరిశీలన అనంతరం కలెక్టర్ పరిపాలనా అనుమతులు జారీ చేస్తారు. ఈ భవనాలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement