Advertisement

School | కూర లేక కారంతో భోజనం

మన పత్రిక, వెబ్​డెస్క్: మహబూబాబాద్ జిల్లా (Mahbubabad District) కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితి కలవరపరుస్తోంది. కూరగాయల సరఫరా టెండర్ ముగిసి 15 రోజులు గడిచినా కొత్త టెండర్ ఇవ్వకపోవడంతో విద్యార్థులకు కూర లేకుండా కారంతోనే భోజనం పెడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

అడవి ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాల విద్యార్థులు బయటకు రాలేక తమ సమస్యలు చెప్పుకోలేకపోయారు. నిన్న జరిగిన పేరెంట్స్ మీటింగ్‌లో విషయం బయటపడగా, ఈ రోజు భోజనంలో పురుగులు రావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమయపాలనపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి.

Advertisement
Advertisement