మన పత్రిక, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బతికుండగానే ఓ వ్యక్తిని మార్చురీలో పెట్టి తాళం వేశారు. బాధితుడు చిన్నగూడూరుకు చెందిన టాక్సీ డ్రైవర్ రాజుగా గుర్తించారు.
గుర్తు తెలియని శవమని భావించిన సిబ్బంది, రాజును రాత్రంతా మార్చురీలోనే ఉంచారు. ఉదయం ఓ స్వీపర్ గమనించి, రాజు బతికే ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని బయటకు తీసి తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. ఆధార్ కార్డు లేదనే కారణంతోనే వైద్య సిబ్బంది అతడిని మొదట అడ్మిట్ చేసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ దారుణ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
