మన పత్రిక, వెబ్డెస్క్ : తమిళ సినిమా మారీశన్ ( Maareesan ) ప్రేక్షకుల ఊహలను పూర్తిగా మించి వెళ్తుంది. పోస్టర్, ప్రోమోలతో ప్రేక్షకులు సినిమా కథను ఊహించే ఈ టైమ్లో, ఈ చిత్రం మాత్రం ఒక్క సన్నివేశం కూడా అంచనా వేయలేని రీతిలో సాగుతుంది. కృష్ణమూర్తి రచించిన కథకు, సుదీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ప్రముఖ కమెడియన్ వడివేలు ( Vadivelu ) , మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రెండున్నర గంటల పాటు కేవలం ఇద్దరి పాత్రలపైనే ఆధారపడి ప్రేక్షకులను బంధించి పెడుతుంది. ఇది నిజంగా అభినందనీయమైన సాధన.
కథ సారాంశం:
దయాలన్ (వడివేలు) ఒక మొండి దొంగ. జైలు జీవితం అతడికి అలవాటు. ఒక రోజు ఇంటిలో దొంగతనం చేస్తుండగా, చైన్తో కట్టిపెట్టిన వేలాయుధం పిళ్ళై ( Fahadh Faasil )ని కలుస్తాడు. అతడికి అల్జీమర్స్ ఉందని తెలుసుకుంటాడు. ప్రారంభంలో భయపడిన దయ, పిళ్ళై దగ్గర ఉన్న డబ్బు కోసం అతడిని విడిపిస్తాడు. పిళ్ళై తన బావమరిదిని కలవడానికి తిరువన్నామలై వెళ్లాలని చెప్పడంతో, దయ అతడిని తీసుకెళ్తానని నమ్మిస్తాడు. అలా వారి ప్రయాణం ప్రారంభమవుతుంది.
ఈ ప్రయాణం అనూహ్య మలుపులతో నిండి ఉంటుంది. ఒక సన్నివేశం తర్వాత మరొకటి ప్రేక్షకుల మతిపోగొడుతుంది. కథ, సన్నివేశాలు, మలుపులు అన్నీ అంచనాలకు మించి ఉంటాయి.
ముగింపు:
మారీశన్ కేవలం థ్రిల్లర్ కాదు – ఒక అద్భుతమైన ఎమోషనల్ జర్నీ. మీ వీకెండ్ వాచ్ కి ఇది బెస్ట్ ఛాయిస్. ఇది మామూలు సినిమా కాదు… ఇది అనుభవం!
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

