మన పత్రిక, వెబ్డెస్క్: ఈ నెల 5వ తేదీన ఆకాశంలో ఓ ఖగోళ అద్భుతం కనువిందు చేయనుంది. ఆ రోజు చందమామ మరింత పెద్దగా, అత్యంత కాంతిమంతంగా కనిపించనున్నాడు. ఇది ఈ ఏడాదిలోనే అతిపెద్ద ‘బీవర్ సూపర్ మూన్’ అని శాస్త్రవేత్తలు తెలిపారు.
Advertisement
ఆ రోజున చంద్రుడు భూమికి చాలా దగ్గరగా, కేవలం 3,56,980 కిలో మీటర్ల దూరానికి చేరుకుంటాడని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేదని, నేరుగా కంటితోనే చూడవచ్చని వారు సూచించారు. కాగా, గత డిసెంబర్ నెలలో కూడా ఒక ‘కోల్డ్ మూన్’ కనిపించిందని శాస్త్రవేత్తలు గుర్తు చేశారు.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

