Flipkart Diwali Sale :  ఫ్లిప్‌కార్ట్ దివాళి సేల్.. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఎలాగంటే?

free electric scooter for flipkart Diwali sale

Flipkart Diwali Sale : మనకు అత్యంత ప్రీతికరమైన పండుగ ఏదైనా ఉంది అంటే అది దివాళి అనే చెప్పుకోవాలి. దీపావళి పండుగ వచ్చిందంటే కొత్త బట్టలు, పిండి వంటలు, టపాసులు, స్వీట్లు ఇలా ఆ సందడే వేరు అని చెప్పుకోవాలి. షాపింగ్ చేసేవాళ్లకు దీపావళి పండుగ వచ్చిందంటే చాలు. అందుకే ప్రముఖ ఈకామర్స్ కంపెనీలు కూడా పలు డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. ఫ్లిప్ కార్ట్ కూడా దివాళి సందర్భంగా పలు ఆఫర్లను తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ దివాళి … Read more

PJR Fans : నవీన్ యాదవ్‌పై పీజేఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

pjr fans fire on Naveen Yadav

PJR Fans : పీజేఆర్ (పి.జనార్ధన్ రెడ్డి) నాన్ లోకల్ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన కామెంట్స్ పై పీజేఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ కు కేవలం లోకల్ ఓట్లే  కావాలా? నాన్ లోకల్ ఓట్ల అవసరం లేదా అంటూ మండిపడ్డారు. పీజేఆర్ లాంటి గొప్ప వ్యక్తిని నాన్ లోకల్ అనడం కరెక్ట్ కాదన్నారు. రాహుల్ గాంధీ యూపీకి చెందిన వ్యక్తి అయినా కూడా ఆయన … Read more

Electricity AE: 15 వేల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన విద్యుత్ అధికారి

electricity AE caught while taking bribe in hyderabad

Electricity AE: కస్టమర్ నుంచి 15 వేల లంచం తీసుకుంటూ ఓ విద్యుత్ అధికారి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని లాలాగూడలో చోటు చేసుకుంది. సింగిల్ ఫేస్ గా ఉన్న మీటర్ ను త్రీ ఫేస్ గా మార్చాలని ఓ కస్టమర్.. లాలాగూడ ఏఈ భూమిరెడ్డి సుధాకర్ రెడ్డిని అడగగా లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో కస్టమర్.. ఏసీబీ అధికారులను సంప్రదించగా వాళ్లు చెప్పినట్టుగా భూమిరెడ్డికి రూ.15 వేల లంచం … Read more

Food Poisoning : గురుకుల పాఠశాల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. 47 మంది విద్యార్థులకు అస్వస్థత

Food Poisoning in AP Gurukul School Hostel in Guntur dist

Food Poisoning : ఏపీలోని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామంలో ఉన్న బీసీ గురుకుల పాఠశాల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది. ఆ ఫుడ్ తిన్న విద్యార్థుల్లో 47 మంది అస్వస్థతకు గురయ్యారు. డయేరియా, వాంతులు, జ్వరంతో ఒకేసారి విద్యార్థులంతా బాధపడటంతో వెంటనే విద్యార్థులను పెదనందిపాడు ప్రైమరీ హెల్త్ సెంటర్ కు తరలించారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వార్డెన్ పై … Read more

Viral Video : తల్లిని కొట్టి బాధతో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నేత.. వీడియో వైరల్

uppal bjp leader raju commits suicide

Viral Video : తన తల్లిని కోపంలో కొట్టానని బాధతో హైదరాబాద్ లోని ఉప్పల్ కు చెందిన బీజేపీ నేత రెవెల్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో తన తల్లిని రాజు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో వల్ల తన పరువు అంతా పోయిందని, అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నానని సెల్ఫీ వీడియో తీసి రాజు బీబీనగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లి తనను మోసం … Read more

Nobel Peace Prize : ట్రంప్ నోబెల్ ప్రైజ్ ఆశలు గల్లంతు.. వెనుజులా మహిళకు పురస్కారం

Venezuela woman maria corina Machado bags noble peace prize

Nobel Peace Prize : చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు నోబెల్ ప్రైజ్ రాబోతోందని వార్తలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తీరా నోబెల్ పురస్కారాలు ప్రకటించిన తర్వాత చూస్తే ట్రంప్ ఆశలు గల్లంతయ్యాయి. 2025 సంవత్సరానికి నోబెల్ శాంతి పురస్కారాన్ని వెనుజులాకు చెందిన మహిళ మరియా కెరీనా మగాడూ దక్కించుకున్నారు. ఆమె ఎవరో కాదు.. 2012 లో వెనుజులా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేశారు. ప్రస్తుతం ఆమె వెనుజులా … Read more

Telangana: నేడే లాస్ట్ డేట్.. అప్లై చేసుకోండి

Telangana: బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్సిటీ)లో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల గడువు శుక్రవారంతో ముగియనుంది. యూజీ (UG), పీజీ (PG), డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరేందుకు నేడే చివరి తేదీ అని అధికారులు తెలిపారు. ఇప్పటికే మూడు సార్లు గడువు పొడిగించామని, ఆసక్తి గల ఉద్యోగులు, అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. దరఖాస్తు చేసుకోవడానికి www.braouonline.in లేదా www.braou.ac.in వెబ్‌సైట్‌లను సందర్శించాలన్నారు.

భువనగిరి: సుద్దాల స్ఫూర్తి అజరామరం.. తరాలు మారినా తరగని పాట

TG Yadadri bhuvanagiri: ప్రజాకవిగా పేరొందిన సుద్దాల హనుమంతు పాటలు తరాలు మారినా నేటికీ ప్రజల నాలుకలపై నాట్యమాడుతూనే ఉన్నాయి. ‘పల్లెటూరీ పిల్లగాడా…’ వంటి అజరామర గీతాలతో ఆయన నిజాం కాలపు వెట్టి బతుకులను కళ్లకు కట్టారు. ఆయన గళం విప్పితే అది ప్రజల గుండెల్లోంచి వచ్చిన ఆక్రోశంగా వినిపించేది. ‘వెయ్ వెయ్ దెబ్బకు దెబ్బ…’ అంటూ ఆయన పాటల్లో రగిలించిన స్ఫూర్తి అజరామరం. సరిగ్గా 1982లో ఇదే రోజున (అక్టోబరు 10) ఆ గొంతుక మూగబోయింది. … Read more

కరీంనగర్: ACBకి చిక్కిన మరో అవినీతి చేప..!

TG Karimnagar: లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ పంచాయతీ కార్యదర్శి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు దొరికిపోయారు. గంగాధర మండలం మధురా నగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మునిగాల అనిల్‌ను శుక్రవారం ఓ లబ్ధిదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు. మధురా నగర్‌లో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల మంజూరు విషయంలో కార్యదర్శి లబ్ధిదారుడిని వేధించారు. బిల్లుల కోసం అనిల్ రూ.10,000 లంచం తీసుకుంటుండగా … Read more

HYDERABAD: ఓపెన్ SSC, INTER గడువు పొడిగింపు

Telangana: ఉమ్మడి రంగారెడ్డి (RR), హైదరాబాద్ (HYD) జిల్లాల్లో చదువు మానేసిన విద్యార్థులకు శుభవార్త. ఓపెన్ ఎస్సెస్సీ (SSC), ఇంటర్ (INTER) కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ అధికారులు గురువారం తెలిపారు. విద్యార్థులు ఫైన్ లేకుండా ఈనెల 13వ తేదీలోగా, అలాగే ఫైన్‌తో ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి గలవారు www.telanganaopenschool.org వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.