యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ దరఖాస్తులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 5 యంగ్ ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 22లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.40,000 జీతంగా చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్: https://ssc.gov.in/ ను సందర్శించవచ్చు.

Gold Rates 11 Oct 2025 : 11 అక్టోబర్ 2025, శనివారం ఈరోజు గోల్డ్ రేట్స్

11 October 2025 today gold rates in telugu

Gold Rates Today : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 11 అక్టోబర్ 2025 శనివారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,370 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,339 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,277 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.184.10 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ లో రూ.1,84,100 … Read more

Horoscope 11 Oct 2025 : 11 అక్టోబర్ 2025 శనివారం రాశి ఫలాలు

11 October 2025 today horoscope in telugu

Today Horoscope : 11 అక్టోబర్ 2025, శనివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : కొత్త పనులను ప్రారంభించకండి. ప్రయాణాలు చేసే వాళ్లు జాగ్రత్తగా వ్యవహరించండి. ఏ పని ప్రారంభించినా ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది.   వృషభం : ధన లాభం పొందుతారు. శుభవార్త వినే చాన్స్ ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. స్త్రీ వల్ల మీకు లాభం వస్తుంది. అత్యంత దగ్గరి వ్యక్తులను … Read more

నటి మంచు లక్ష్మికి జర్నలిస్ట్ మూర్తి క్షమాపణ

దక్ష సినిమా ప్రమోషన్ సమయంలో జర్నలిస్ట్ వేదుల మూర్తి మంచు లక్ష్మి దుస్తులపై ప్రశ్న అడగడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. దీంతో మంచు లక్ష్మీ ‘మా’ అసోసియేషన్, ఫిల్మ్ ఛాంబర్‌లను ఆశ్రయించి క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. లక్ష్మితో ఇంటర్వ్యూలో తాను అడిగిన ప్రశ్నలు ఆమెకు బాధ కలిగించాయని తెలుసుకున్న సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ మూర్తి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక వీడియోను విడుదల చేశారు. “నేను అడిగిన ప్రశ్నలు మీరు బాధ … Read more

TG: ఏఐతో సీఎం చంద్రబాబు పేరుతో మోసం.. టీడీపీ నేతలకు టోకరా

Telangana: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఫోన్ చేసినట్లుగా నమ్మించి గుర్తుతెలియని సైబర్ నేరగాడు తెలంగాణ టీడీపీ నాయకులను మోసగించాడు. సత్తుపల్లికి చెందిన పలువురు టీడీపీ నేతలకు AI సాయంతో వీడియో కాల్స్ చేసి, రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తామని నమ్మబలికాడు. అనంతరం, వారి నుంచి ఫోన్‌పే ద్వారా కొంత నగదును వసూలు చేశాడు. ఈ ఘటనలో మోసపోయిన నేతలను తెలంగాణ నుంచి … Read more

TG: బీసీ రిజర్వేషన్లపై 14న రాష్ట్ర బంద్: ఆర్.కృష్ణయ్య

Telangana: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై, ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో నంబర్ 9 హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. కాగా, ఎన్నికలపై, బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై హైకోర్టు స్టే విధించ‌డంతో బీసీల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని బీసీ సంఘం నాయకులు, ఎంపీ ఆర్ కృష్ణ‌య్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 14న అన్ని బీసీ సంఘాలతో కలిసి … Read more

Fire Crackers : బాణసంచా బ్యాన్ చేసిన సుప్రీం.. పిల్లలను పండుగ చేసుకోనివ్వరా?

ncr states urge supreme court to lift ban on crackers

Fire Crackers : ఎన్‌సీఆర్ ఢిల్లీ రీజియన్ లో కాలుష్యం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్‌సీఆర్ రీజియన్ లో వాయు కాలుష్యం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా దీపావళి సమయంలో పేల్చే టపాసుల వల్ల వాయు కాలుష్యం తీవ్రత ఇంకా పెరుగుతుంది. అందుకే ఎన్‌సీఆర్ పరిధిలో ఈ దివాళికి ఫైర్ క్రాకర్స్ పేల్చుకుండా సుప్రీం కోర్టు బ్యాన్ విధించింది. బాణసంచా విక్రయాలను కూడా నిషేధించింది. గత ఏప్రిల్ లో 3నే తీర్పును వెలువరించింది. కానీ, … Read more

Flipkart Diwali Sale :  ఫ్లిప్‌కార్ట్ దివాళి సేల్.. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఎలాగంటే?

free electric scooter for flipkart Diwali sale

Flipkart Diwali Sale : మనకు అత్యంత ప్రీతికరమైన పండుగ ఏదైనా ఉంది అంటే అది దివాళి అనే చెప్పుకోవాలి. దీపావళి పండుగ వచ్చిందంటే కొత్త బట్టలు, పిండి వంటలు, టపాసులు, స్వీట్లు ఇలా ఆ సందడే వేరు అని చెప్పుకోవాలి. షాపింగ్ చేసేవాళ్లకు దీపావళి పండుగ వచ్చిందంటే చాలు. అందుకే ప్రముఖ ఈకామర్స్ కంపెనీలు కూడా పలు డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. ఫ్లిప్ కార్ట్ కూడా దివాళి సందర్భంగా పలు ఆఫర్లను తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ దివాళి … Read more

PJR Fans : నవీన్ యాదవ్‌పై పీజేఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

pjr fans fire on Naveen Yadav

PJR Fans : పీజేఆర్ (పి.జనార్ధన్ రెడ్డి) నాన్ లోకల్ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన కామెంట్స్ పై పీజేఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ కు కేవలం లోకల్ ఓట్లే  కావాలా? నాన్ లోకల్ ఓట్ల అవసరం లేదా అంటూ మండిపడ్డారు. పీజేఆర్ లాంటి గొప్ప వ్యక్తిని నాన్ లోకల్ అనడం కరెక్ట్ కాదన్నారు. రాహుల్ గాంధీ యూపీకి చెందిన వ్యక్తి అయినా కూడా ఆయన … Read more

Electricity AE: 15 వేల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన విద్యుత్ అధికారి

electricity AE caught while taking bribe in hyderabad

Electricity AE: కస్టమర్ నుంచి 15 వేల లంచం తీసుకుంటూ ఓ విద్యుత్ అధికారి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని లాలాగూడలో చోటు చేసుకుంది. సింగిల్ ఫేస్ గా ఉన్న మీటర్ ను త్రీ ఫేస్ గా మార్చాలని ఓ కస్టమర్.. లాలాగూడ ఏఈ భూమిరెడ్డి సుధాకర్ రెడ్డిని అడగగా లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో కస్టమర్.. ఏసీబీ అధికారులను సంప్రదించగా వాళ్లు చెప్పినట్టుగా భూమిరెడ్డికి రూ.15 వేల లంచం … Read more