Advertisement

కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ 2025: రైతులకు ₹5 లక్షల వరకు అప్పు, కేవలం 4% వడ్డీ

Kisan Credit card scheme : భారత ప్రభుత్వం రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) స్కీమ్ ను అమలు చేస్తోంది. పంటలు సాగు చేయడానికి లేదా వ్యవసాయ సంబంధిత పనులకు డబ్బు కావాలంటే ఈ స్కీమ్ గొప్ప ఎంపిక. ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డ్ ( Kisan Credit Card ) ద్వారా గరిష్ఠంగా ₹5 లక్షల వరకు అప్పు లభిస్తుంది. ఇంతకు ముందు పరిమితి ₹3 లక్షలు మాత్రమే. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ₹2 లక్షలు పెంచింది.

ఈ అప్పులో ₹3 లక్షలు పంటల కోసం, ₹2 లక్షలు వ్యవసాయ సంబంధిత పనులకు లభిస్తాయి.

Advertisement

ఎంత వడ్డీ రేటు వర్తిస్తుంది?

సాధారణ వడ్డీ రేటు 9%. కానీ ప్రభుత్వం 2% వడ్డీ సబ్సిడీ మరియు 3% టైమ్లీ రీపేమెంట్ బోనస్ ఇస్తుంది. ఫలితంగా రైతులు కేవలం 4% వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

ఉదాహరణకు, ₹5 లక్షల అప్పుకు సంవత్సరానికి కేవలం ₹20,000 మాత్రమే వడ్డీగా చెల్లించాలి.

ఎలా దరఖాస్తు చేయాలి?

  1. మీకు ఇష్టమైన బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ కు వెళ్లండి.
  2. హోమ్ పేజీ లో “కిసాన్ క్రెడిట్ కార్డ్” ఆప్షన్ కనిపిస్తుంది.
  3. దానిపై క్లిక్ చేయండి.
  4. “దరఖాస్తు చేయండి” పై క్లిక్ చేయండి.
  5. అవసరమైన అన్ని వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయండి.
  6. దరఖాస్తు రెఫరెన్స్ నెంబర్ లభిస్తుంది.
  7. అర్హత ఉంటే, బ్యాంక్ 5 రోజులలోపు మిమ్మల్ని సంప్రదిస్తుంది.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వంటి రాష్ట్రాలు ఈ స్కీమ్ పై ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. రైతులు తమ ఆర్థిక అవసరాలకు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.

Advertisement