మన పత్రిక, వెబ్డెస్క్ : కామారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి పథకం’ కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కామారెడ్డి బస్టాండ్లో మహిళలు ధర్నాకు దిగారు.
ఉచిత ప్రయాణం వల్ల బస్సుల్లో రద్దీ పెరిగిందని, అవసరం లేనివారు కూడా బస్సుల్లో ప్రయాణిస్తుండడంతో విద్యార్థినులు, ఉద్యోగినులకు సీట్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కండక్టర్లు, డ్రైవర్లు మహిళలను చిన్నచూపు చూస్తున్నారని, మర్యాదగా మాట్లాడడం లేదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి “మీరు కోటీశ్వరులవుతారు” అని చెప్పారని, కానీ ఇప్పుడు రోడ్డున పడ్డామని విమర్శించారు. పథకం వల్ల మహిళల మధ్య అనవసర గొడవలు పెరుగుతున్నాయని, ఇలాంటి పథకాలతో మనుషుల మధ్య చిచ్చు పెట్టొద్దని సూచించారు. ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయకుంటే నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
Advertisement
