మన పత్రిక, స్పోర్ట్స్: రేపు ప్రారంభమయ్యే Indian Premier Leagueకు ముందే Royal Challengers Bengaluruకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. జట్టుకు కీలక బౌలర్గా భావించిన నువాన్ తుషారా(Nuwan Thushara) ఈ సీజన్కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు ఎన్ఓసీ ఇవ్వడానికి శ్రీలంక క్రికెట్ బోర్డు నిరాకరించినట్లు సమాచారం. గాయం ఏదీ లేకపోయినా ఫిట్నెస్ సరిగా లేదనే కారణంతో ఐపీఎల్లో పాల్గొనడాన్ని అడ్డుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ పరిణామంపై శ్రీలంక మాజీ క్రికెటర్ చమిందా వాస్(Chaminda Vaas) స్పందిస్తూ బోర్డు వైఖరిని తప్పుపట్టారు. ఫిట్నెస్ అంశాన్ని ఏళ్లుగా నిర్లక్ష్యం చేసి, ఐపీఎల్ ముందు అకస్మాత్తుగా కఠిన నిబంధనలు అమలు చేయడం సరైన విధానం కాదన్నారు. ఈ నిర్ణయం జట్టుపై ప్రభావం చూపే అవకాశముందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Advertisement
ఇవి కూడా చదవండి :
Advertisement
