మన పత్రిక, వెబ్డెస్క్
సూపర్స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), విజనరీ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ SSMB 29 ప్రపంచవ్యాప్తంగా అంచనాలను పెంచుతోంది. ఇప్పటికే భారత్లో రెండు షెడ్యూల్లు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం కెన్యాలో మూడో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా, దర్శకుడు రాజమౌళి కెన్యా విదేశాంగ మంత్రి ముసాలియా ముదావాదితో భేటీ కావడం ఈ సినిమాకు అంతర్జాతీయంగా హైప్ పెంచింది. ఈ సమావేశం ఫోటోలను ముదావాది తన అధికారిక సోషల్ మీడియాలో పంచుకున్నారు.
తన దేశమైన కెన్యా షూటింగ్కు ఎంపిక కావడం గర్వకారణమని, ఈ సినిమా తమ దేశ చరిత్రను ప్రపంచానికి చూపించగలదని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో మసాయి మారా, నైవాషా, అంబోసెలి వంటి ప్రదేశాలు ప్రధానంగా చూపించబోతున్నట్లు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తుండగా, ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) హీరోయిన్గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్నారు. నవంబర్ 2025లో సినిమా నుండి ఫస్ట్ అప్డేట్ రానుంది. ఈ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని మరింత పెంచనుంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

