మన పత్రిక, వెబ్డెస్క్: ఇండోనేషియా (Indonesia)లోని సెంట్రల్ జావా ప్రాంతంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జకార్తా నుంచి యోగ్యకర్తకు వెళ్తున్న ‘కహాయా ట్రాన్స్పోర్టు’ (Kahaya Transport) బస్సు అదుపుతప్పి క్రాప్యాక్ టోల్ గేట్ ఎగ్జిట్ వద్ద ఉన్న భారీ కాంక్రీట్ దిమ్మను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జవ్వగా.. 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
Advertisement
ప్రమాద వివరాలు:
- మొత్తం ప్రయాణికులు: 34 మంది.
- మృతులు: 15 మంది.
- క్షతగాత్రులు: 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం సెమారాంగ్లోని RSUP డాక్టర్ కరియాది ఆసుపత్రికి తరలించారు.
- కారణం: బస్సు అధిక వేగంతో ప్రయాణించడం వల్లే అదుపుతప్పిందని సెమారాంగ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ చీఫ్ బుదియోనో వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
