Saudi Accident : సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ట్రావెల్స్ బస్సు.. డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో బస్సులో ఉన్న 43 మంది ప్రయాణికుల్లో 42 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. సజీవ దహనం అయిన 42 మంది ఇండియన్సే. అందులో ఉన్నవాళ్లంతా హైదరాబాద్ వాళ్లే అని తెలుస్తోంది.
మక్కా దర్శనం కోసం వెళ్లిన వాళ్లు అక్కడ దర్శనం పూర్తి చేసుకొని అనంతరం మదీనాకు వెళ్తుండగా బదర్ – మదీనా రూట్ లో మఫరహత్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో 20 మంది మహిళలు, 12 మంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. సౌదీ సమయం ప్రకారం అర్ధరాత్రి 1.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన నుంచి తప్పించుకొని ఒక్క వ్యక్తి బయట పడినట్లు సమాచారం.
ఈ ఘటనలో ఎక్కువ మంది తెలంగాణ వాళ్లు అందులోనూ హైదరాబాద్ వాళ్లు ఎక్కువగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. సౌదీలో ఉన్న భారత ఎంబసీ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
