Advertisement

అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ సేవల్లో మార్పులు

మన పత్రిక, వెబ్​డెస్క్: స్పీడ్ పోస్ట్ ( Speed Post ) ధరలు పెరగనున్నాయి. సవరించిన ధరల కారణంగా పోస్టల్ సేవలు కొంచెం ఖరీదైనవి అవుతాయి. అలాగే, ఓటీపీ ఆధారిత బట్వాడా సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. ఓటీపీ ధ్రువీకరణ చేసుకున్న తర్వాతే వస్తువులను అందజేస్తారు. ఇది పోస్టల్ సేవల్లో భద్రతను పెంచుతుంది.

రైల్వే ( Railway ) సేవల్లో కూడా మార్పులు వస్తున్నాయి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా జనరల్ టికెట్లను రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఆధార్ ధ్రువీకరణ పొందిన యూజర్లు ఈ విధానంలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇది సౌకర్యం, వేగం రెండూ కలిపి ఉంటుంది.

Advertisement

ఫైనాన్స్ ( Finance ) రంగంలో కూడా మార్పులు వస్తున్నాయి. అక్టోబర్ 4 నుంచి ఆర్బీఐ చెక్ క్లియరింగ్ లో నిరంతరాయ క్లియరింగ్ పద్ధతిని అమలు చేయనుంది. చెక్కుల క్లియరెన్స్ ప్రక్రియ అదే రోజు గంటల వ్యవధిలో క్రెడిట్ టు క్రెడిట్ జరుగుతుంది. ఇది బ్యాంకు లావాదేవీలకు ఒక పెద్ద ఊరట.

పింఛన్ స్కీమ్‌ల ( Pension Schemes ) కీలక మార్పులు కూడా వస్తున్నాయి. భవిష్య నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ కేంద్ర రికార్డుల నిర్వహణ ఏజెన్సీలు అందించే ఎన్‌పీఎస్, ఎన్‌పీఎస్ లైట్, ఎన్‌పీఎస్ వాత్సల్య, యూపీఎస్, అటల్ పెన్షన్ యోజన వంటి పింఛను పథకాల సేవల చార్జీలను సవరించనుంది. సబ్‌స్ర్కైబర్ల ఖాతాలను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లో నిర్వహించడానికి వీటిని వసూలు చేస్తారు.

ఎన్‌పీఎస్ ( NPS Reforms ) చందాదారులకు కూడా కీలక మార్పు వస్తోంది. ఇప్పుడు కేవలం ఒక ఎన్‌పీఎస్ ప్లాన్‌లో మాత్రమే 100 శాతం తమ డబ్బును పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తారు. ఇది పెట్టుబడిదారులకు ఒక స్పష్టమైన ఎంపికను అందిస్తుంది.

Advertisement