మన పత్రిక, వెబ్డెస్క్: సంక్రాంతి పండుగ రద్దీ మొదలవుతున్న వేళ హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ నగరవాసులకు కీలక సూచనలు చేశారు. పండుగ కోసం కుటుంబంతో సహా సొంతూళ్లకు వెళ్లేవారు.. ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా సంబంధిత బీట్ ఆఫీసర్కు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇలా ముందస్తు సమాచారం అందించడం వల్ల.. పోలీసులు తమ రెగ్యులర్ పెట్రోలింగ్లో ఆయా ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంటుందని తెలిపారు. దొంగతనాలు జరగకుండా చూసేందుకు, నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని సీపీ పేర్కొన్నారు. కేవలం తాళాలు వేసి వెళ్లడమే కాకుండా, పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా భద్రత మరింత పెరుగుతుందని ఆయన వివరించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
