మన పత్రిక, వెబ్డెస్క్: హుజురాబాద్ మండలంలో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులపై వేటు పడింది (3 TEACHERS SUSPENDED IN HUZURABAD MANDAL). విధుల్లో నిర్లక్ష్యం, పాఠశాలకు మద్యం సేవించి రావడం వంటి తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో వారిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.
సస్పెండ్ అయిన వారిలో హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పీఈటీ, ఫిజికల్ సైన్స్ టీచర్, అలాగే చెల్పూర్ పాఠశాలకు చెందిన మరో ఫిజికల్ సైన్స్ టీచర్ ఉన్నారు. హుజురాబాద్ టీచర్లు మద్యం సేవించి విధులకు హాజరైనట్లు ఆరోపణలు ఉన్నాయి.
మరో ఉపాధ్యాయుడు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేయడం, విద్యార్థులను నిరుత్సాహపరచడం వంటి చర్యలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. పదేపదే హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
