Advertisement

ముగ్గురు టీచర్లు సస్పెండ్.. మద్యం మత్తులో విధులకు!

మన పత్రిక, వెబ్​డెస్క్: హుజురాబాద్ మండలంలో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులపై వేటు పడింది (3 TEACHERS SUSPENDED IN HUZURABAD MANDAL). విధుల్లో నిర్లక్ష్యం, పాఠశాలకు మద్యం సేవించి రావడం వంటి తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో వారిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.

సస్పెండ్ అయిన వారిలో హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పీఈటీ, ఫిజికల్ సైన్స్ టీచర్, అలాగే చెల్పూర్ పాఠశాలకు చెందిన మరో ఫిజికల్ సైన్స్ టీచర్ ఉన్నారు. హుజురాబాద్ టీచర్లు మద్యం సేవించి విధులకు హాజరైనట్లు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

మరో ఉపాధ్యాయుడు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేయడం, విద్యార్థులను నిరుత్సాహపరచడం వంటి చర్యలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. పదేపదే హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది.

Advertisement