మన పత్రిక, వెబ్డెస్క్
కాకినాడ: ఆర్థిక ఇబ్బందులతో(Financial problems) భర్త ఆత్మహత్య చేసుకున్న రెండు నెలలకే అతని భార్య తీవ్ర మనోవేదనకు గురై రెండేళ్ల కుమారుడికి విషమిచ్చి, తానూ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సర్పవరం భావనారాయణపురంలోని గాంధీనగర్లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనతో రెండు కుటుంబాలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి.
Advertisement
జనపల్లి గోపి అనే ఉద్యోగి కుమారుడి పుట్టినరోజు కోసం రూ. 3 లక్షల అప్పు చేసి, వాటిని తీర్చలేక జులై 22న ఆత్మహత్య(suicide) చేసుకున్నారు. భర్త మరణంతో కుంగిపోయిన అతని భార్య ఆకాంక్ష, గత నెల 31న తన రెండేళ్ల కుమారుడు సార్విక్తో కలిసి విషం తీసుకున్నారు. కుటుంబసభ్యులు వెంటనే వారిని కాకినాడ జీజీహెచ్లో చేర్చగా, పరిస్థితి విషమించడంతో తల్లీబిడ్డలు బుధవారం మృతిచెందారు. ఈ ఘటనపై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
