మన పత్రిక, వెబ్ డెస్క్ : ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాగల ఐదు రోజులు భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్(Orange alert) జారీ చేసింది.
అలాగే శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, యన్.టి.ఆర్, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తీరం వెంబడి గంటకు 30 నుంచి 50 కి.మీ.ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Advertisement
ఇవి కూడా చదవండి :
Advertisement
