జీఎస్టీ 2.0 నేటి నుంచి అమలులోకి రావడంతో లక్షల మంది ప్రజలపై ఆర్థిక భారం తగ్గనుంది. ప్రభుత్వం పలు వస్తువులపై జీఎస్టీ రేట్లను గణనీయంగా తగ్గించింది. నిత్యావసరాలపై 18% నుంచి 5%కి జీఎస్టీ తగ్గించడం ఒక కీలక మార్పు. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు నెలకు వందల రూపాయల ఆదా ఇస్తుంది.
ఆరోగ్య బీమా పథకాలు, పెన్సిళ్లు, నోట్ బుక్స్ వంటి స్టేషనరీ వస్తువులపై సున్నా జీఎస్టీ అమలు చేయడం విద్యార్థులకు, కుటుంబాలకు పెద్ద ఉపశమనం. ఔషధాలపై ఉన్న 12% జీఎస్టీని 5%కి తగ్గించడంతో మందుల ఖర్చులు తగ్గుతాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులకు ఇది పెద్ద ఊరట. ఎగువ మధ్యతరగతికి కూడా ఊరట లభించింది. చిన్న కార్లు, బైక్లు, ఏసీలు, టీవీలపై 28% నుంచి 18%కి జీఎస్టీ తగ్గించడం వినియోగదారులకు హాయి కలిగిస్తుంది.
ఈ మార్పులు వినియోగదారుల డిమాండ్ను పెంచి, ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
