మన పత్రిక, వెబ్డెస్క్: పసిడి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. ఆదివారం (డిసెంబర్ 28) ఉదయం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజే 10 గ్రాములపై 22 క్యారెట్లకు రూ.1100, 24 క్యారెట్లకు రూ.1150 మేర పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. కుటుంబాల బడ్జెట్ను ఈ ధరల పెరుగుదల దెబ్బతీస్తోంది.
తాజా పెంపుతో హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,000కు చేరగా, 24 క్యారెట్ల ధర రూ.1,36,500 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, కోల్కతా, బెంగళూరులోనూ ధరలు రూ.1.37 లక్షల మార్కును తాకాయి. పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనాలనుకునే వారికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి.
Advertisement
ఇవి కూడా చదవండి :
Advertisement
