Advertisement

ఆదిలాబాద్: దిగుబడులు తగ్గిపోవడంతో రైతుల ఆందోళన

TG Adilabad: పత్తి సాగు చేసిన అన్నదాతలకు ఈసారి ప్రకృతి నుంచి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. వర్షాల ధాటికి కాత (కాయ), పూత పూర్తిగా నష్టపోయాయి. దీని ఫలితంగా, గతంతో పోలిస్తే దిగుబడులు ఏకంగా సగానికి తగ్గిపోయే అవకాశం ఉందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Advertisement

ఉమ్మడి ఆదిలాబాద్ (ADB) ప్రాంతంలో ఈసారి సుమారు 8 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. దిగుబడి తగ్గినా, మార్కెట్‌లో మద్దతు ధర (MSP) ఆశాజనకంగా ఉంటే కొంత ఉపశమనం లభిస్తుందని రైతులు ఆశలు పెట్టుకున్నారు.

Advertisement