మన పత్రిక, వెబ్డెస్క్: జిల్లాలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈ పనులను అక్టోబర్ నెలాఖరు వరకు తప్పనిసరిగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ( Collector P Srija ) కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో, అధికారులతో పనుల పురోగతిని సమీక్షించారు. పనులు పూర్తి చేసి ఎంబీ రికార్డులు నమోదు చేస్తే వెంటనే బిల్లులు విడుదల చేయడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.
ప్రతి పాఠశాల వారీగా పనుల పురోగతిని రివ్యూ చేసిన అదనపు కలెక్టర్, గ్రామాల్లో పాఠశాలకు నీరు సరఫరా లేని పక్షంలో మిషన్ భగీరథ పైప్ లైన్ నుంచి కనెక్షన్ అందించాలని సూచించారు.
సకాలంలో పనులు పూర్తి కాని పక్షంలో సంబంధిత పాఠశాల సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారుల వేతనంలో కోత విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సి.హెచ్. రామకృష్ణ, ఎంపీడీఓలు, ఎం.ఈ.ఓ.లు, హెడ్ మాస్టర్లు, ఏఈలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
