మన పత్రిక, వెబ్డెస్క్: మొంథా తుఫాన్ (cyclone montha) కారణంగా కురుస్తున్న భారీ వర్షాల మధ్య 108 సిబ్బంది సాహసం చేశారు. దేవరకొండ మండలం (Devarakonda mandal) మడమడక గ్రామానికి చెందిన జట్టి దేవి అనే నిండు గర్భిణీకి బుధవారం ఉదయం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి.
కుటుంబ సభ్యులు 108కి కాల్ చేయగా, చింతపల్లి 108 సిబ్బంది రవి నాయక్, సైదులు సంఘటనా స్థలానికి బయల్దేరారు. అయితే, మార్గమధ్యంలోని మైనంపల్లి వాగు భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, సిబ్బంది ధైర్యంగా ఆ మహిళను స్ట్రెచర్ సహాయంతో వరద ప్రవహిస్తున్న వాగును దాటించారు. అనంతరం ఆమెను క్షేమంగా దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
