Delhi Car Blast : ఈ నెల 10వ తేదీన సాయంత్రం ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన కారు బాంబు పేలుడు ధాటికి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరికొంతమంది గాయపడ్డారు. వాళ్లకు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిని ప్రధాని మోదీ కూడా పరామర్శించారు. మరోవైపు ఈ కారు బాంబు పేలుడు ఒక సూసైడ్ మిషన్ గా పోలీసులు గుర్తించారు. ఇది ఖచ్చితంగా ఉగ్రవాద చర్యే అని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉగ్రదాడి చేసేందుకు ప్లాన్ చేసిన పలువురు ఉగ్రవాదులను పోలీసులు ఇప్పటికే అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.
అయితే.. ఎర్రకోట వద్ద సిగ్నల్ పడటంతో వాహనాలన్నీ ఆగిపోయాయి. సిగ్నల్ కోసం వేచి చూస్తున్నాయి. ఇంతలో ఆ సిగ్నల్ లో వాహనాల మధ్యలో ఉన్న కారు ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. ఆ కారుకు సమీపంలో ఉన్న వారిలో 12 మంది మృతి చెందారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
