Advertisement

కరీంనగర్: ACBకి చిక్కిన మరో అవినీతి చేప..!

TG Karimnagar: లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ పంచాయతీ కార్యదర్శి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు దొరికిపోయారు. గంగాధర మండలం మధురా నగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మునిగాల అనిల్‌ను శుక్రవారం ఓ లబ్ధిదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు. మధురా నగర్‌లో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల మంజూరు విషయంలో కార్యదర్శి లబ్ధిదారుడిని వేధించారు. బిల్లుల కోసం అనిల్ రూ.10,000 లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకుని, కేసు నమోదు చేశారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement