మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న నీటిపారుదల శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి సాగునీటి రంగం, ప్రాజెక్టుల స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రధానంగా అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్న అంశాలపై సీఎం ఫోకస్ పెట్టారు. రాష్ట్రానికి రావాల్సిన నదీజలాల వాటా, ఏపీతో కొనసాగుతున్న జల వివాదాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై అధికారుల నుంచి ఆరా తీశారు. ముఖ్యంగా ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకంపై సీఎం కూలంకషంగా సమీక్షించారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇప్పటివరకు జరిగిన పనులు, గత రెండేళ్లలో చోటుచేసుకున్న పరిణామాలు, బీఆర్ఎస్ పాలనలో జరిగిన లోపాలను వెలికితీయాలని అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
