మన పత్రిక: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) శుక్రవారం దేశవ్యాప్తంగా శాంతియుత ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా దేశంలోని పలు నగరాల్లో విస్తృతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ నిరసనల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై శుక్రవారం ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది. అంతకుముందు గురువారం రాత్రి జైపూర్లోని పత్రికా గేట్ వద్ద కూడా ప్రజలు భారీగా చేరి కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరుపై ఈ నిరసనల తీవ్రత మరింత పెరుగుతోందని పార్టీ జాతీయ ప్రతినిధి అశుతోష్ రంకా పేర్కొన్నారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
