Advertisement
chevella news

chevella: 21 మంది మృతి.. 3 నెలల చిన్నారి సహా!

మన పత్రిక, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో 21 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు.

Advertisement

మృతుల్లో మూడు నెలల చిన్నారి పాప, ఆమె తల్లి కూడా ఉండటం తీవ్రంగా కలిచివేసింది. రోడ్డు పక్కన తల్లి, బిడ్డ మృతదేహాలు ఉన్న దృశ్యం అక్కడివారిని కంటతడి పెట్టించింది. ఇదే ప్రమాదంలో తాండూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు కూడా మృతి చెందారు. సంఘటనా స్థలం క్షతగాత్రులు, మృతుల బంధువుల ఆర్తనాదాలతో భీతావహంగా మారింది.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement