Advertisement

మాజీ సర్పంచులు, ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు.. సర్కార్‌పై ఆగ్రహం

మన పత్రిక, వెబ్​డెస్క్: పెండింగ్ బిల్లులు, జీతాల పెంపు డిమాండ్‌తో మాజీ సర్పంచులు, ఆశా కార్యకర్తలు తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సూర్యాపేట నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన పలువురు నాయకులను, ఆశా వర్కర్లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. దీంతో అక్కడ వాతావరణం వేడెక్కింది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని, ఆశా వర్కర్ల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి.. ఇప్పుడు విస్మరించిందని వారు మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్టులు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement