మన పత్రిక, వెబ్డెస్క్
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై సీబీఐ విచారణకు ఆదేశించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిషన్ నివేదికపై శాసనసభలో చర్చ జరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.
CBI enquiry on kaleshwaram project
జూలై 31, 2025న కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆగస్టు 4న మంత్రిమండలి ఆమోదించింది. ఆ తర్వాత శాసనసభ ముందు ఉంచి చర్చించారు. నివేదికలో నిర్లక్ష్యం, దురుద్దేశం, ఆర్థిక అవకతవకలు, ప్లానింగ్ లేకపోవడం వంటి క్రిమినల్ స్థాయి లోపాలు గుర్తించారు.
ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ నిర్మాణంలో ప్లానింగ్, డిజైన్, నాణ్యతా నిర్వహణలో లోపాలు ఉన్నాయి. ప్రాజెక్టులో కేంద్ర, రాష్ట్ర సంస్థలు, అంతర్ రాష్ట్ర అంశాలు పాలుపంచుకున్నాయి. ఈ కారణాలతో సమగ్ర, స్వతంత్ర విచారణ కోసం కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. నిజాయితీతో కూడిన విచారణ జరగాలని ప్రభుత్వం కోరుకుంది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదికను సభ ముందుంచారు. స్పీకర్ అనుమతితో చర్చ ప్రారంభించారు. మేడిగడ్డ స్పీయర్స్ కుంగిపోయిన సంఘటన నుంచి విచారణ కమిషన్ ఏర్పాటు వరకు అన్ని వివరాలు సభలో తెలియజేశారు. 665 పేజీల నివేదికలో సంక్లిష్టమైన అంశాలు ఉన్నందున సీబీఐ విచారణ అవసరమని ప్రభుత్వం పేర్కొంది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
