మన పత్రిక, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం (Bus accident in chevella) మీర్జాగూడ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు అక్కడికక్కడే మృతి చెందారు.
Advertisement
మృతులు తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్ట్ ఇయర్), సాయి ప్రియ (డిగ్రీ ఫైనల్ ఇయర్), తనుషా (ఎంబీఏ)గా గుర్తించారు. వీరంతా హైదరాబాద్లో ఉన్నత చదువులు చదువుతున్నారు.
Advertisement
ఇటీవల బంధువుల పెళ్లి కోసం తాండూరుకు వచ్చిన ఈ ముగ్గురు, తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు సోమవారం తెల్లవారుజామున బస్సు ఎక్కారు. మార్గమధ్యంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురూ మరణించడంతో వారి కుటుంబంలో, తాండూరులో తీవ్ర విషాదం అలుముకుంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

