మన పత్రిక, వెబ్డెస్క్: బంగ్లాదేశ్ (Bangladesh) మరోసారి హింసతో రగిలిపోతోంది. ఇంకిలాబ్ మంచ్ నాయకుడు, కరడుగట్టిన నేత ఉస్మాన్ హాది (Usman Hadi) హత్య తర్వాత ఢాకాలో మొదలైన అల్లర్లు ఇంకా చల్లారకముందే మరో ఘాతుకం జరిగింది. సోమవారం బీఎన్పీ (BNP) ఖుల్నా డివిజన్ అధిపతి మోతలేబ్ సిక్దర్పై (Motaleb Sikder) గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు.
ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉస్మాన్ హాది మరణం తర్వాత దేశవ్యాప్తంగా అశాంతి నెలకొనగా, తాజా కాల్పుల ఘటనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీగా భద్రతా దళాలను మోహరించింది. 2024 విద్యార్థి ఉద్యమం సమయంలో వెలుగులోకి వచ్చిన ఉస్మాన్ హాది, భారత వ్యతిరేక వ్యాఖ్యలతో పాపులర్ అయ్యారు. ఆయన హత్య తర్వాత బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
