పండగ పూట విషాదం.. కరెంట్ షాక్‌తో యువకుడు మృతి

మన పత్రిక, వెబ్​డెస్క్ : సంతోషంగా గడపాల్సిన వినాయకచవితి పండుగ ఆ కుటుబంలో విషాదం నింపింది. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో పండగ సందర్భంగా లైటింగ్ కోసం స్తంభాన్ని ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో చరణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి … Read more

OTT లోకి వచ్చేసిన విజయ్ దేవరకొండ “కింగ్‌డమ్”

మన పత్రిక, వెబ్​డెస్క్ : విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‍బస్టర్ చిత్రం ‘కింగ్‌డ‌మ్’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. జూలై 31న ఈ సినిమా ధియేటర్లలో విడుదలై రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ Netflix లో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ భోర్సే నటించగా, నాగవంశీ నిర్మించారు. కథ విషయానికి వస్తే.. ఒక కానిస్టేబుల్ అయిన … Read more

MEDAK | 300 మంది విద్యార్థులను సేవ్ చేసిన రెస్క్యూ టీమ్

మన పత్రిక, వెబ్​డెస్క్ : మెదక్ జిల్లా రామాయంపేటలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన గురుకుల డిగ్రీ కళాశాలలో చిక్కుకున్న 300 మంది విద్యార్థులను రెస్క్యూ టీమ్ సురక్షితంగా కాపాడింది. ఈ కళాశాల ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాలగా కూడా పనిచేస్తోంది. Medak gurukul degree college rescue news నీటి మట్టం పెరగడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బోట్ల సాయంతో విద్యార్థులను … Read more

పండగ పూట.. అంగన్వాడీలకు శుభవార్త

మన పత్రిక, వెబ్​డెస్క్ : జగన్ ప్రభుత్వంలో నిరసనలకు దిగిన అంగన్వాడీలకు ప్రభుత్వం పలు శుభవార్తలు తెలిపింది. నెల రోజుల్లో వారికి కొత్త సెల్ ఫోన్లు అందజేస్తామని ప్రకటించింది. ఇప్పటికే మూలన పడిన సెల్ ఫోన్లను వాడుతున్న వారికి ఈ నిర్ణయం పని వేగాన్ని, సమర్థతను పెంచేందుకు దోహదపడుతుంది. అంతే కాకుండా అంగన్‌వాడీల్లో ఇండక్షన్ స్టవ్‌ల వాడకానికి వీలుగా, నెలకు రూ. 500 చొప్పున విద్యుత్ ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరించనుంది. అయితే, సామాజిక భద్రత పెన్షన్ల … Read more

భర్తను వదిలి పదిసార్లు పారిపోయిన మహిళ

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఓ వివాహిత చేసిన డిమాండ్ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. తన భర్తను వదిలి పది సార్లు ప్రియుడితో పారిపోయిన ఆ మహిళ, చివరికి తన జీవితాన్ని ఇద్దరితోనూ పంచుకుంటానని ప్రకటించింది. ఈ విచిత్రమైన వ్యవహారం పరిష్కరించడానికి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు పంచాయతీని ఏర్పాటు చేశారు. పంచాయతీలో అందరి ముందు ఆమె తన నిర్ణయాన్ని నిర్మొహమాటంగా ప్రకటించి, నెలలో 15 రోజులు తన భర్తతో, మిగిలిన 15 … Read more

హైదరాబాద్-కామారెడ్డి మధ్య రైల్వే సర్వీసులు నిలిచిపోయాయి

మన పత్రిక, వెబ్​డెస్క్ : భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌ నుంచి కామారెడ్డి మార్గంలో రైల్వే రాకపోకలు గందరగోళంగా మారాయి. రెండు రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. కాచిగూడ-మెదక్, నిజామాబాద్-తిరుపతి రైళ్లు రద్దయ్యాయి. Hyderabad to kamareddy trains rain news today మరో నాలుగు రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో దారి మళ్లించారు. పట్టాలపై నీరు నిల్వ ఉండటంతో రైలు సర్వీసులు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు రవాణాకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. సీఎం రేవంత్ … Read more

Telangana Rain Holiday | స్కూల్, కాలేజ్ సెలవు

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో ఆగస్టు 28, 2024న అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. డీఈవో రాజు ఈ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు. స్కూల్స్ మరియు కాలేజీలతో పాటు ఇతర విద్యా సంస్థలకు కూడా ఇది వర్తిస్తుంది. Rain holiday august 28 telangana today జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాల ప్రభావం ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని … Read more

TG INTER EXAMS 2026 | ఇంటర్ పరీక్షలు జనవరిలోనే

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు 2026 జనవరిలో నిర్వహించాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్ మెడియట్ ఎడ్యుకేషన్ ప్రాథమికంగా నిర్ణయించింది. ఇది ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అమలు చేయడానికి సమాలోచనలు జరుగుతున్నాయి. Telangana Inter exams in January 2026. ఇప్పటి వరకు ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో నిర్వహించేవి. కొత్త నిర్ణయంతో పరీక్షలు ముందుగానే జరగనున్నాయి. దీని వల్ల విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎఫ్‌సెట్, క్లాట్, … Read more

Indiramma Houses | రూ. 1,000 కోట్లు విడుదల, 2.04 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ( TELANGANA ) పేదలకు సొంతిళ్లు కల్పించే లక్ష్యంతో అమలులో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల ( Indiramma Indlu ) పథకం వేగంగా పురోగమిస్తోంది. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ పథకం కింద ఇప్పటివరకు రూ. 1,000 కోట్లు లబ్ధిదారులకు చెల్లించారు. Indiramma Houses news రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 3 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. అందులో 2.04 లక్షల … Read more

August 27 Current Affairs in Telugu: పోటీ పరీక్షల కోసం ఆగస్టు 27, 2025 నాటి కరెంట్ అఫైర్స్

మన పత్రిక, వెబ్​డెస్క్ : UPSC, APPSC, TSPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి ఆగస్టు 27, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్‌డేట్స్. Today current affairs in telugu ప్రధాని మోదీ ఎక్కడ కొత్త EV ప్లాంట్ ప్రారంభించారు?గుజరాత్ 2025 కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం ఎవరు గెలుచుకున్నారు?మీరాబాయి చాను ఆగస్టు 1, 2025 నుండి భారత … Read more