Revanthanna Kanuka: 65 లక్షల మహిళలకు ఉచిత చీరలు
తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ‘రేవంతన్న కానుక’ పేరుతో ఉచిత చీరలు పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.318 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలోని సుమారు 65 లక్షల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నారు. చీరల సరఫరా ఇప్పటికే జిల్లాలకు ప్రారంభమైంది. శుక్రవారం నుంచి చీరలను జిల్లాలకు పంపిణీ చేస్తున్నారు. బతుకమ్మ పండుగ నాటికి పంపిణీ పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.