CPGET 2025 | కౌన్సెలింగ్ నేటి నుంచే.. షెడ్యూల్ ఇదే!

CPGET FINAL PHASE COUNSELLING

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో పీజీ సీట్ల భర్తీకి నిర్వహించే సీపీగెట్ (CPGET) చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం (అక్టోబర్ 29) ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబర్ 1వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, మరియు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం, నవంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. తుది విడత సీట్లను నవంబర్ 9న కేటాయించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

Railway Jobs: రాత పరీక్ష లేదు, 10th+ITI అర్హత

railway jobs

మన పత్రిక, వెబ్​డెస్క్: ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1104 ఖాళీలను భర్తీ చేయనుండగా, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 15వ తేదీలోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. అర్హతల విషయానికొస్తే, అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి. అక్టోబర్ 16, 2025 నాటికి అభ్యర్థుల … Read more

Suryapet: గొర్రెల మందపై కుక్కల దాడి.. 10 గొర్రెలు మృతి!

Suryapet news

మన పత్రిక, వెబ్​డెస్క్: సూర్యాపేట జిల్లా ( Suryapet District ) అర్వపల్లి మండలం కొమ్మాల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో వీధి కుక్కలు ఓ గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ ఘటనలో పది గొర్రెలు మృతి చెందగా, మరో ఆరు తీవ్రంగా గాయపడ్డాయి. గ్రామానికి చెందిన పగిడి వీరయ్య అనే రైతు రాత్రి సమయంలో తన ఇంటి పరిసరాల్లో ఉంచిన మందపై కుక్కలు విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలిపారు. గాయపడిన గొర్రెలు … Read more

2 నెలల తర్వాత రాహుల్.. కూటమిలో 11 చోట్ల పోటీ | Rahul Gandhi Bihar elections

Rahul Gandhi Bihar elections

మన పత్రిక, వెబ్​డెస్క్: రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) చివరిసారిగా సెప్టెంబర్ 1న ‘ఓటు అధికార యాత్ర’ ముగింపు రోజున బీహార్‌లో కనిపించారు. ఆ యాత్రతో కాంగ్రెస్ క్యాడర్‌లో వచ్చిన ఉత్సాహాన్ని ఆయన కొనసాగించలేదని, ఇప్పుడు కేవలం మొక్కుబడిగా ప్రచారానికి వస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నవంబర్ 6న తొలిదశ పోలింగ్ జరగనుండగా, నవంబర్ 4 సాయంత్రానికే ప్రచారం ముగియనుంది. తేజస్వి యాదవ్ అధ్వర్యంలో ఎన్నికలు జరగడంపై రాహుల్ గాంధీకి అసంతృప్తి (లుకలుకలు) ఉండటం వల్లే … Read more

8th Pay Commission |  కేబినెట్ ఆమోదం! 50 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి.

8th Pay Commission

మన పత్రిక, వెబ్​డెస్క్: ఈ కేబినెట్ నిర్ణయాల వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 8వ వేతన కమిషన్ తన సిఫార్సులను 18 నెలల్లోపు ప్రభుత్వానికి సమర్పిస్తుందని ఆయన తెలిపారు. ఈ నూతన సిఫార్సులు 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కేంద్రం తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ఈ … Read more

Cyclone Montha: ఏపీకి భారీ ముప్పు.. 3 రాష్ట్రాల్లో హై అలర్ట్!

Cyclone Montha

మన పత్రిక, వెబ్​డెస్క్: తుఫాను ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ముప్పు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. రాష్ట్రంలోని తీర ప్రాంతాల వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. విశాఖపట్నంలో భీకర గాలులతో కుండపోత వర్షం కురుస్తున్నట్లు సమాచారం. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి 8 నుంచి 10 అడుగుల ఎత్తు … Read more

Cyber Crime: 99 వేలు పోగొట్టుకున్న వ్యక్తి.. గూగుల్‌లో నెంబర్ వెతికి..

nagarkurnool man loses 99000 in tv recharge

మన పత్రిక, వెబ్​డెస్క్: వివరాల్లోకి వెళితే, నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామానికి చెందిన తిరుపతయ్య, తన సన్ డైరెక్ట్ రీఛార్జ్ కోసం గూగుల్‌లో కాంటాక్ట్ నెంబర్ వెతికారు. అతనికి 1800419 5370 నెంబర్ కనిపించింది. ఆ నెంబర్‌కు కాల్ చేసి ‘సన్ డైరెక్ట్ కస్టమర్ కేరా?’ అని అడగగా, అవతలి వ్యక్తి ‘అవును’ అని సమాధానమిచ్చాడు. తిరుపతయ్య రీఛార్జ్ సమస్య గురించి చెప్పగా, ఆ వ్యక్తి టీవీ ఆన్ చేసి రూ. 10 రీఛార్జ్ … Read more

Wines Tenders: ఒకే వ్యక్తికి 5 షాపులు!

Wines Tenders

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లా మద్యం టెండర్లలో ఓ వ్యక్తిని భారీ అదృష్టం వరించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో చర్లపల్లికి చెందిన మాడుగుల నగేష్ అనే వ్యక్తి ఐదు షాపుల కోసం టెండర్లు దాఖలు చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన లాటరీ (లక్కీ డ్రా)లో ఆయన అదృష్టం తలుపు తట్టింది. తాను దరఖాస్తు చేసిన ఐదు షాపులకు గాను, ఐదింటినీ నగేష్ దక్కించుకున్నారు. ఒకే వ్యక్తికి ఐదు షాపులు దక్కడంతో ఆయన … Read more

Jubilee Hills by poll | 170 మంది రౌడీషీటర్ల బైండోవర్!

Jubilee Hills by poll

మన పత్రిక, వెబ్​డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు ముందస్తుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో, నియోజకవర్గ పరిధిలోని 170 మంది రౌడీషీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. వీరిలో అత్యధికంగా బోరబండ ఏరియా నుంచి 74 మంది ఉండటం గమనార్హం. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, పోలీసులు బైండోవర్ … Read more

TG News: భోజన విరామ సమయంలో నిరసన SGTU

sgtu yadadri protest

మన పత్రిక, వెబ్​డెస్క్: వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రములో ప్రాథమిక పాఠశాల మహిళా ప్రధానోపాధ్యాయురాలు పై పోలీసు కానిస్టేబుల్ దాడికి నిరసనగా ఈరోజు ప్రాథమిక పాఠశాల బట్టుగూడ గ్రామంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో SGTU YADADRI జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే కరుణ గారులు పాల్గొన్నారు